హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ అండర్-19 బాలికల వన్డే చాలెంజర్ ట్రోఫీలో హైదరాబాద్ అమ్మాయి జి. త్రిష దుమ్మురేపుతున్నది. శుక్రవారం భారత్ ‘డి’తో జరిగిన మ్యాచ్ లో భారత్ ‘బి’తరఫున బరిలోకి దిగిన త్రిష (54; 4 ఫోర్లు) అర్ధశతకంతో చెలరేగింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ‘డి’50 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు చేసింది. నీలమ్ (71) టాప్స్కోరర్. లక్ష్యఛేదనలో త్రిష, శిఖ (40) రాణించడంతో భారత్ ‘బి’46.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్ల్లో కలిపి ఇప్పటి వరకు 182 పరుగులు చేసిన త్రిష ప్రస్తుతం టోర్నీ టాప్ స్కోరర్గా కొనసాగుతున్నది.