న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఫ్యూచర్ రిటైల్కు చెందిన 200 స్టోర్లను ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వాధీనంలోకి తెచ్చుకుంది. ఇక నుంచి రిలయన్స్ రిటైల్ నిర్వహించనున్న ఈ స్టోర్లలో ఫ్యూచర్ స్టోర్ల సిబ్బందికి ఉద్యోగాల్ని ఆఫర్ చేసింది. ఆయా ఫ్యూచర్ రిటైల్ స్టోర్స్ ఉన్న స్థల యజమానులకు లీజు మొత్తాల్ని చెల్లించడంలో కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ విఫలమయ్యింది. దాంతో పలువురు స్థల యజమానులు రిలయన్స్ను సంప్రదించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫ్యూచర్ గ్రూప్ అభ్యర్థన మేరకు కొన్ని ఫ్యూచర్ స్టోర్స్ లీజు మొత్తాల్ని గతంలో రిలయన్స్ చెల్లించింది. తద్వారా సంక్రమించిన హక్కులతో తాజాగా ఆ స్టోర్స్ను రిలయన్స్ టేకోవర్ చేసిందని ఆ వర్గాలు వివరించాయి. బిగ్బజార్ స్టోర్స్తో సహా దేశంలో ఫ్యూచర్ గ్రూప్నకు 1,700 స్టోర్లు ఉన్నాయి.