న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా భవిష్యత్తు వైభవంగా ఉంటుందని ఆ సంస్థ సీఈవో, ఎండీ క్యాంప్బెల్ విల్సన్ అన్నారు. ఇవాళ ఓ మీడియా సంస్థ ఆయన్ను పలుకరించగా.. ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఎయిర్ ఇండియాలో విమానాల సంఖ్యను పెంచుతున్నారా అని ఆయన్ను అడగ్గా.. ఆ అంశంపై త్వరలోనే ప్రకటన చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఎయిర్ ఇండియా భవిష్యత్తు భవ్యంగా ఉంటుందని, చాలా ఉత్సాహకరంగా ఉందని, ఇక్కడకు రావడం సంతోషకరంగా ఉందని, కానీ ప్రస్తుతం ఎటువంటి కామెంట్ చేయలేనని ఆయన చెప్పారు.