షాంఘై: మిలీనియల్స్ బేకరీ ఫుడ్స్ అంటే ప్రాణం పెడతారు.. యూ-ట్యూబ్ అందుబాటులోకి రావడంతో ఇంట్లోనే మైక్రోవేవ్తో కేక్లు, బర్గర్లు చేసుకోవచ్చు.. ఇక వేసవిలో చల్లని నీరు కావాలన్నా.. జ్యూస్ వంటివి తయారు చేసుకోవాలంటే ఐస్.. దానికోసం ఫ్రిజ్లు కావాలి..
కానీ వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్కు అనుగుణంగా ఫ్రిజ్లు, మైక్రోవేవ్ తయారీ సంస్థలు వాటిని సరఫరా చేయలేక చతికల పడ్డాయి.. దీనికి ఓ కారణం ఉంది.. ఫ్రిజ్లు, మైక్రోవేవ్ తయారీలో కీలకమైన చిప్ల కొరత హోం అప్లియెన్సెస్ సంస్థలను వెంటాడుతున్నది..
కరోనా మహమ్మారి వల్ల వర్క్ ఫ్రం హోం, లెర్నింగ్ ఫ్రం హోం కల్చర్ సాధారణమైంది. తత్ఫలితంగా ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ల వాడకం భారీగా పెరిగింది.. అంతకుముందు అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో చైనా టెలికం దిగ్గజం హువావే.. రెండేండ్లకు సరిపడా చిప్లు నిల్వ చేసి పెట్టుకుంది.. ఇతర స్మార్ట్ఫోన్ సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా నిల్వ చేసుకున్నాయి.
కరోనా అనంతర కాలంలో పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరిగింది.. ప్రజలు కార్లు.. ఇతర వాహనాల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అనూహ్యంగా పెరిగిన డిమాండ్కు అనుగుణంగా చిప్లు, సెమీ కండక్టర్లు మార్కెట్లో అందుబాటులో లేవు.. ఇప్పటివరకు చిప్ల కొరతతో కస్టమర్ల బుకింగ్స్ను బట్టి కార్లను తయారు చేయలేక ఆటోమొబైల్స్ వెనుకబడ్డాయి. ఆ బాటలోనే హోం అప్లియెన్సెస్ సంస్థలు ప్రయాణిస్తున్నాయి.
విర్ల్పూల్ కార్పొరేషన్ చైనా అధ్యక్షుడు జాసోన్ అలీ మాటల్లో చెప్పాలంటే అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి చైనాలోని హోం అప్లియెన్సెస్ సంస్థలకు భారీ ఆర్డర్లు వచ్చి పడ్డాయి. కానీ చిప్ల కొరత వల్ల కొన్ని నెలల పాటు మైక్రోవేవ్, ఫ్రిజ్, వాషింగ్ మిషన్ల ఎగుమతులు 25 శాతం తగ్గుతాయని జాసోన్ అలీ పేర్కొన్నారు.
షాంఘైలో జరుగుతున్న అప్లియెన్సెస్ అండ్ వర్డ్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోలో జాసోన్ అలీ మాట్లాడుతూ ఇది విపత్తు వంటి పరిణామమేనన్నారు. ఒకవైపు దేశీయ కస్టమర్లను శాటిస్పై చేయడంతోపాటు మరోవైపు విదేశాల నుంచి వచ్చే ఆర్డర్లకు అనుగుణంగా ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్మిషన్లు, మైక్రోవేవ్ సహా హోం అప్లియెన్సెస్కు అవసరమైన చిప్లు, మైక్రో కంట్రోలర్లు, సింపుల్ ప్రాసెసర్ల కోసం చమటోడ్చాల్సి వస్తుందన్నారు.
గతేడాది డిసెంబర్ ప్రారంభం నుంచే చిప్ల కొరత మొదలైంది. స్మార్ట్ఫోన్లు, లాప్టాప్ల విక్రయాలు ఊహలకందకుండా పెరిగిపోవడంతో కార్ల తయారీ సంస్థల అంచనాలు తలకిందులయ్యాయి.
కార్లలో పవర్ మేనేజ్మెంట్లో చిప్లు చాలా కీలకం. చిప్ల కొరత వల్ల జనరల్ మోటార్స్ సహా పలు కార్ల తయారీ సంస్థలు ఉత్పత్తి లక్ష్యాల్లో కోత విధిస్తే, షియోమీ వంటి స్మార్ట్ ఫోన్ సంస్థలు ఫోన్ల ధరలు పెంచేశాయి.
ఈ సమస్య కేవలం విర్ల్పూల్కు మాత్రమే పరిమితం కాలేదు. ఇతర అప్లియెన్సెస్ సంస్థలు ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. నూతన హైఎండ్ స్టవ్ను విపణిలో విడుదల చేయడానికి నాలుగు నెలల టైం పడుతుందని హంగ్ఝై రోబమ్ అప్లియెన్సెస్ పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
విదేశాల నుంచి చిప్ల దిగుమతిపై ఆధారపడకుండా హంగ్ఝై రోబమ్ స్థానిక ఉత్పత్తులపై ఆధారపడేందుకు సిద్ధం అవుతున్నది. చిప్ల కొరత వల్ల హోం అప్లియెన్సెస్ తయారీ వ్యయం పెరిగిపోతున్నదని ఆయా సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రన్నింగ్ బస్సులోంచి వాంతులు.. లారీ ఢీకొట్టడంతో తెగిపోయిన బాలిక తల..!
మోదీ సభకు వెళ్తుండగా ప్రమాదం.. తమిళనాడు స్పీకర్కు గాయాలు
పున్నమి చంద్రుడే ఆ నౌకను కదిలించాడు.. !