సొసైటీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..
కరోనా సమయంలో ఇంటి నుంచి బయటకు కాలు పెట్టలేక భయంతో ఇబ్బందులు పడ్డాం. అలాంట పరిస్థితుల్లో పేద ప్రజలకు రూ.10కే చికిత్స చేయడం హర్షణీయం. అంబేద్కర్ భవన్లో వైద్య సేవలు అందజేయాలని సొసైటీ సభ్యుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
వైద్యులకు రుణపడి ఉంటాం
అంబేద్కర్ భవన్లో రూ.10కే చికిత్సలు చేయడానికి ముందుకు వచ్చిన డాక్టర్లకు స్థానికులు రుణపడి ఉంటారు. వినాయక్నగర్ బస్తీ, నేరేడ్మెట్, కేశవనగర్, కాకతీయనగర్, వినోభానగర్, దినకర్నగర్ తదితర ప్రాంతాలను నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వారు వచ్చి చికిత్స పొందుతున్నారు. వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాం.