వికారాబాద్, ఏప్రిల్ 28 : రైతులకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ పట్టణం మార్కెట్ యార్డులో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. సేవా ధృక్పథంతో రైతులకోసం, హమాలీ కార్మికుల కోసం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు.
రైతులు, కార్మికులు, ట్రేడర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ముద్ద దీప, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, ఏఎంస్సీ చైర్మన్, ప్రజా ప్రతినిధులు, డైరెక్టర్లు , పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.