న్యూఢిల్లీ, నవంబర్ 19: దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్పీఐ) దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఓ తాజా నివేదిక ప్రకారం ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికం ముగిసే నాటికి ఎఫ్పీఐల పెట్టుబడుల విలువ భారతీయ ఈక్విటీ మార్కెట్లలో 667 బిలియన్ డాలర్లకు చేరింది. అంతకుముందు ఏప్రిల్-జూన్తో పోల్చితే 13 శాతం వృద్ధి నమోదైంది. జూన్ ఆఖరున 592 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. నిరుడు సెప్టెంబర్ చివర్లో 398 బిలియన్ డాలర్లుగానే ఉన్నట్లు మార్నింగ్స్టార్ నివేదిక తెలిపింది. అయితే త్రైమాసికంవారీగా చూస్తే ఈ ఏప్రిల్-జూన్లో కంటే జూలై-సెప్టెంబర్లో ఎఫ్పీఐల పెట్టుబడులు తగ్గాయి. ఈ జూలై-సెప్టెంబర్లో 563 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఏప్రిల్-జూన్లో 678 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు తేలింది. కాగా, జూలైలో 1.51 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్పీఐలు.. ఆగస్టులో 284.02 మిలియన్ డాలర్లు, సెప్టెంబర్లో 1.79 బిలియన్ డాలర్ల పెట్టుబడులను తెచ్చారు. దీంతో నికరంగా ఈ మూడు నెలల్లో 563 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినైట్లెంది.