వరుసగా నాలుగో విజయం
ప్రొ కబడ్డీ లీగ్
బెంగళూరు: సీజన్ ఆరంభంలో నిలకడ కొనసాగించలేకపోయిన పుణెరీ పల్టన్.. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో వరుసగా నాలుగో విజయం సాధించింది. బుధవారం జరిగిన పోరులో పల్టన్ 36-34 తేడాతో యూ ముంబాను చిత్తు చేసింది. పుణె జట్టులో మోహిత్ గోయత్ (9 పాయింట్లు), అస్లమ్ ఇమాన్దార్ (8 పాయింట్లు) రాణించగా.. యూ ముంబా తరఫున అజిత్ (10 పాయింట్లు) సత్తాచాటాడు. తాజా సీజన్లో 15 మ్యాచ్లాడిన పల్టన్ 8 విజయాలు నమోదు చేసుకొని 42 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. దబంగ్ ఢిల్లీ (53) టాప్లో ఉండగా.. ఆ తర్వాత బెంగళూరు (51), పట్నా (50) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన తెలుగు టైటాన్స్ ఒక్కటంటే ఒక్క విజయంతో పట్టిక అట్టడుగు స్థానానికి పరిమితమైంది. బుధవారమే జరిగిన మరో మ్యాచ్లో పట్నా పైరెట్స్ 37-35తో యూపీ యోధాపై విజయం సాధించింది.