న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: వాట్సాప్ కొత్త నిబంధన తెచ్చింది. ఫార్వర్డ్ మెసేజ్లను ఇకపై ఒకసారి ఒక గ్రూప్కు మాత్రమే పంపే నిబంధన పెట్టింది. ఒకవేళ ఎక్కువ గ్రూపులకు చేయాలనుకుంటే తిరిగి మెసేజ్ను ఎంచుకొని ఫార్వర్డ్ చేయాలి. సింగిల్ గ్రూప్ ఫార్వర్డ్ లిమిటేషన్ ఇప్పటికే కొన్ని ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో ప్రవేశపెట్టినట్టు సంస్థ వెల్లడించింది. తాజా నిర్ణయంతో అన్ని స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్లను ఒకటి కంటే ఎక్కువ గ్రూప్లకు ఫార్వర్డ్ చేసే వీలు ఉండకపోవచ్చు.