జమ్ము : హవాలా సొమ్ము కేసులో జమ్ము కశ్మీర్ మాజీ సీఎం జితేంద్ర సింగ్ అలియాస్ బాబూ సింగ్ను జమ్ము కశ్మీర్ పోలీసులు శనివారం కథువాలో అరెస్ట్ చేశారు. బాబూ సింగ్ను ప్రశ్నించేందుకు పోలీసులు ఆయనను జమ్ముకు తరలించారు.
హవాలా రాకెట్ను చేధించిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసినప్పటి నుంచి మాజీ మంత్రి బాబూ సింగ్ తప్పించుకు తిరుగుతున్నారు. నిందితుల నుంచి జమ్ములో రూ ఆరు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని నిందితులు సింగ్కు ముట్టచెప్పాల్సి ఉండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
2002లో పీడీపీ-కాంగ్రెస్ ప్రభుత్వంలో బాబూ సింగ్ మంత్రిగా పనిచేశారు. ఆర్టికల్ 370 రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సింగ్ కేంద్రం తీరును తప్పుపడుతూ జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి, రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.