న్యూఢిల్లీ: బీసీసీఐ మాజీ కార్యదర్శి, జార్ఖండ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అమితాబ్ చౌదరీ కన్నుమూశారు. 58 ఏళ్ల అమితాబ్కు మంగళవారం గుండెపోటు వచ్చింది. వినోద్ రాయ్ చైర్మెన్గా ఉన్న సమయంలో అమితాబ్ కార్యదర్శిగా చేశారు. జార్ఖండ్ క్రికెట్కు కూడా అమితాబ్ ఎంతో కాంట్రిబ్యూట్ చేశారని, ఆ స్థానాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదు అని మాజీ ట్రెజరర్ అనిరుధ్ చౌదరీ తెలిపారు. బీసీసీఐ అధ్యక్షుడిగా దాల్మియా ఉన్న సమయంలో జార్ఖండ్కు ఫస్ట్ క్లాస్ స్టేటస్ రావడంలో అమితాబ్ విశేషంగా కృషి చేశారు. జార్ఖండ్కు ఫస్ట్ క్లాస్ స్టేటస్ వచ్చిన తర్వాతే ధోనీ బీహార్ నుంచి ఆ రాష్ట్రానికి మారాడు. జార్ఖండ్ క్రికెట్కు రాంచీని అడ్డాగా మారింది కూడా చౌదరీనే. ప్రపచం స్థాయి మేటి స్టేడియాన్ని కూడా నిర్మించారు. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అయిన అమితాబ్ చౌదరీ రాజకీయాల్లోనూ ప్రవేశించారు. 2005-06లో జింబాబ్వే వెళ్లిన భారత జట్టుకు టీమ్ మేనేజర్గా కొనసాగారు. అమితాబ్ చౌదరీ మృతి పట్ల జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నివాళి అర్పించారు.