జాబితాలో ఐఐటీ ఢిల్లీ, జామియా, ఐఎంఏ
న్యూఢిల్లీ, జనవరి 1: మదర్ థెరెసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ ఎన్జీవోలతో పాటు ఢిల్లీలోని ప్రముఖ విద్యాసంస్థల ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ను కూడా కేంద్ర హోం శాఖ నిలిపివేసింది. ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ను నిలిపివేసిన 5,789 సంస్థల్లో ఐఐటీ ఢిల్లీ, జామియా మిలియా వర్సిటీ, లేడీ శ్రీరామ్ కాలేజీలతో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) కూడా ఉండటం గమనార్హం. వీటితో పాటు నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఆక్స్ఫామ్ ఉన్నాయి. వీటి రిజిస్ట్రేషన్ గడువు డిసెంబర్తో ముగిసింది. అయినా రెన్యువల్కు దరఖాస్తు చేసుకోలేదు. దీంతో వీటి రిజిస్ట్రేషన్ను కేంద్రం నిలిపివేసినట్టు భావిస్తున్నారు. దీంతో పాటు 179 సంస్థల రెన్యువల్ దరఖాస్తులను కూడా కేంద్ర హోంశాఖ తిరస్కరించింది. ఏదైనా ఎన్జీవో కానీ, విద్యా సంస్థ కానీ విదేశీ నిధులు పొందాలంటే ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.