న్యూఢిల్లీ: భారీ భూకంపంతో జపాన్(Japan Earthquake) వణికిపోయిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేల్పై 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఆ భూకపం ధాటికి రోడ్లు, రైల్వే స్టేషన్లలో ఉన్న డిస్ప్లే బోర్డులు ఊగిపోయాయి. ప్రకంపనల సమయంలో జనం ప్రాణాల్ని కాపాడుకునేందుకు సురక్షిత ప్రదేశాలకు వెళ్లారు. ఇలాంటి ఘటనలకు చెందిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా.. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పడే తమ ఇండ్లల్లోకి వెళ్లవద్దు అని కోస్టల్ ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. నోటో ద్వీపకల్పంలో వేల మంది ఆర్మీ సిబ్బంది, ఫైర్ ఫైటర్లు, పోలీసు ఆఫీసర్లు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు. అయితే అనేక చోట్ల రోడ్లు ధ్వంసం కావడం వల్ల రెస్క్యూ పనులకు అంతరాయం కలుగుతోంది.
Some of the Footage coming out of Japan following the 7.6 Magnitude Earthquake which Struck the Country earlier this morning is Insane and truly shows the Power of Geological Forces on this Planet. pic.twitter.com/iwCRB3jmCv
— OSINTdefender (@sentdefender) January 1, 2024