సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ) : ఇక నుంచి నగర రోడ్లపై బండి నిలువదు.. నడక ఆగదు. రద్దీ మార్గాల్లోనూ పాదచారులు దర్జాగా రోడ్డు దాటొచ్చు. గ్రేటర్లో ముఖ్యమైన జంక్షన్లలో పాదచారుల సౌకర్యార్థం రూ.50కోట్లతో 18 చోట్ల జీహెచ్ఎంసీ ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్వోబీ)లను చేపడుతున్నది. ఇప్పటికే ఐదు చోట్ల అందుబాటులోకి వచ్చా యి. ఈ నెల 27న మరో ఏడు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ప్రారంభించే దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన ఆరు చోట్ల ఎఫ్వోబీలను వచ్చే నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.