న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఆర్థిక మౌలిక వసతుల కల్పన, అభివృద్ధికి జాతీయ బ్యాంకును ఏర్పాటు చేయాలని పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టారు. గత నెల ఒకటో తేదీన వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తూ ఆమె మౌలిక వసతుల కల్పనకు జాతీయ బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక మౌలిక వసతుల కల్పన, అభివృద్ధికి జాతీయ బ్యాంకు బిల్లు-2021ను ఆమె లోక్సభకు సమర్పిస్తారు.
డెవలప్మెంట్ ఆఫ్ నాన్ రీసోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ ఇన్ ఇండియాకు మద్దతుగా ఈ బిల్లును నిర్మలా సీతారామన్ ప్రతిపాదించనున్నారు. డెవలప్మెంట్, ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రతిపాదిస్తున్న ఈ బ్యాంకులో వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.5.54 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేరుస్తారు. బిజినెస్ ఆఫ్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతుల కల్పనను ముందుకు తీసుకెళ్లడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కోసం బాండ్లు, డెరివేటివ్స్ మార్కెట్ల డెవలప్మెంట్ను ఈ బిల్లు తప్పనిసరి చేస్తుంది. దేశవ్యాప్తంగా మౌలిక వసతులను కల్పించడం ద్వారా ఉద్యోగాలను కల్పించడంతోపాటు వినియోగ డిమాండ్ను పెంపొందించాలన్నది ప్రభుత్వ వ్యూహంగా ఉన్నది.