శ్రీశైలం : ఎగువ నుంచి శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం డ్యామ్కు లక్ష క్యూసెక్కులకుపైగా ఇన్ఫ్లో వస్తున్నది. ఒక క్రస్ట్గేటు పది అడుగుల ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. బుధవారం సాయంత్రం జూరాల ప్రాజెక్ట్ ద్వారా 1,03,249 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 17,108 క్యూసెక్కులు వదులగా.. శ్రీశైలం జలాశయానికి వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 1,25,043 క్యూసెక్కుల ఇన్ఫో నీర్లు రిజర్వాయర్కు వచ్చి చేరినట్లు అధికారులు తెలిపారు. డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా నీటి సామర్థ్యం 215.807 టీఎంసీల నీటి నిల్వ ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 884.80 అడుగల నీటి నిల్వలు నమోదైనట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఒక్క క్రస్ట్ గేట్ ద్వారా 27,983 క్యూసెక్కులు, ఎడమగట్టు, కుడిగట్టు విద్యుతోత్పత్తి ద్వారా 37,438 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్కు విడుదల చేశారు.