న్యూఢిల్లీ, నవంబర్ 8: విమాన ప్రయాణీకులకు స్పైస్జెట్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈఎంఐల్లో టిక్కెట్లను కొనుక్కునే అవకాశాన్ని సోమవారం కల్పించింది. 3 నెలలు, 6 నెలలు, 12 నెలల వాయిదాల్లో చార్జీలను చెల్లించేలా ఓ సరికొత్త పథకాన్ని పరిచయం చేసింది. అయితే 3 నెలల ఈఎంఐ అప్షన్లో ఎలాంటి అదనపు చెల్లింపులు (వడ్డీ) ఉండబోవని ఈ సందర్భంగా స్పైస్జెట్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ప్రయోజనాన్ని పొందాలనుకుంటే ప్రయాణీకులు తమ పాన్ నంబర్, ఆధార్ నంబర్ లేదా వీఐడీ వివరాలను ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. ఈ వివరాలను వన్-టైం పాస్వర్డ్తో ధ్రువీకరిస్తామన్నది. యూపీఐ ఐడీ ద్వారా తొలి ఈఎంఐని కస్టమర్లు చెల్లించినైట్లెతే, ఆ తర్వాతి ఈఎంఐలూ అదే యూపీఐ ఐడీ నుంచి మినహాయించబడుతాయని వివరించింది. కాగా, బ్యాంకింగ్ మోసాల నేపథ్యంలో ప్రయాణీకులు ఈ ఈఎంఐ పథకాన్ని పొందడానికి ఎటువంటి క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలను ఇవ్వనక్కర్లేదని ఈ సందర్భంగా స్పైస్జెట్ స్పష్టం చేసింది.