హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు చేయాల్సిన పనులతోపాటు, పెండింగ్ అంశాల పరిష్కారం కోసం కేంద్రం అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేయాలని టీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి డిమాండ్ చేశారు. రాజ్యసభ జీరోఅవర్లో ఆయన మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు చేయాల్సిన అంశాలు 38 వరకు ఉన్నాయని చెప్పారు. పన్నుల వాటాలో నష్టం భర్తీకి 15వ ఆర్థికసంఘం తెలంగాణకు ప్రత్యేక గ్రాంట్గా రూ.723 కోట్లు ఇవ్వాలని చెప్పిందని, 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం సానిక సంస్థలకు రూ.965 కోట్లు రావాల్సి ఉన్నదని గుర్తుచేశారు.