మాండ్ల : పెండ్లి బృందాన్ని తీసుకువెళ్తున్న మినీ ట్రక్కు ప్రమాదవశాత్తు బోల్తాపడటంతో ఐదుగురు మృతిచెందగా మరో 46 మంది గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని మండ్ల సమీపంలోని పోట్లా గ్రామంలో గురువారం ఉదయం 11 గంటలకు చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వివాహం అనంతరం పెండ్లి బృందం చందేరా నుంచి స్వస్థలం దేవ్ డోంగ్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను మండ్ల, జబల్పూర్ ఆస్పత్రులకు తరలించారు.