న్యూఢిల్లీ: దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న ఐదుగురు బంగ్లాదేశ్ జాతీయులను ( Bangladesh nationals ) పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని కడుగోడిలో ఐదుగురు బంగ్లాదేశ్ వాసులు అక్రమంగా ఉంటున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి ఆ ఐదుగురుని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లపై ఫారినర్స్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి ప్రస్తుతం తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నది. బెంగళూరు క్రైమ్ విభాగం జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.