హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఈ) సెట్ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలో ఉర్దూ మీడియంలో ఉమెరా పర్వీన్ 78 మార్కులతో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకును సొంతం చేసుకొన్నారు. ఉమెరా పర్వీన్.. నిజామాబాద్ జిల్లా, రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందినవారు.
తెలుగు మీడియంలో ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం రుద్రాపూర్ గ్రామానికి చెందిన మొర్లె మురళి 65 మార్కులతో తొలి ర్యాంకు సాధించారు. ఇంగ్లిష్ మీడియంలో జోగులాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని నల్లకుంటకు చెందిన మీర్జా మహ్మద్ ఇర్షాద్ బేగం 77 మార్కులతో మొదటి ర్యాంకును కైవసం చేసుకొన్నారు. మొత్తం 71శాతానికిపైగా విద్యార్థులు అర్హత సాధించారని డీఈఈ సెట్ కన్వీనర్ శ్రీనివాసాచారి తెలిపారు. ఫలితాల కోసం http://deecet. cdse. telangana.gov. inను సంప్రదించాలని కోరారు.