ఒట్టావా, నవంబర్ 9: వాతావరణ మార్పుల కారణంగా సంభవిస్తున్న దీర్ఘకాల వ్యాధులతో ఏటా 50 లక్షల మంది మరణిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అయితే, వాతావరణ మార్పుల వల్ల అనారోగ్యానికి గురైన వ్యక్తిని శాస్త్రీయపరంగా తొలిసారిగా కెనడా వైద్యులు గుర్తించారు. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్సులోని కూటెనాయ్లో గత జూన్లో 1,600కు పైగా కార్చిచ్చులు వ్యాపించాయి. దీంతో అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరీక్షించిన వైద్యులు ఆమె అస్తమాతో బాధపడుతున్నట్టు గుర్తించారు. వాతావరణ మార్పులతో అస్వస్తతకు గురైన రోగిని గుర్తించడం ఇదే తొలిసారని కూటెనాయ్ లేక్ దవాఖాన వైద్యుడు ఒకరు పేర్కొన్నారు.