1872లో నిజాం పాలకులు తొలి ఇంగ్లిష్ మీడియంగా ఆలియా స్కూల్ను ప్రారంభించారు. ఈ స్కూల్కు ప్రభుత్వం దాదాపు రూ.35 లక్షల వరకు నిధులు కేటాయించారు. ప్రస్తుతం అన్ని తరగతి గదులలో ఫ్యాన్లు, స్విచ్బోర్డులు, వైరింగ్ వంటి పనులు కొనసాగిస్తున్నారు. గోడలకు అందంగా రంగులు వేయడంతో పాటు విద్యార్థులను ఆకట్టుకునే విధంగా అందమైన, సంస్కృతికి, వినోద, విజ్ఞానానికి సంబంధించిన బొమ్మలు కూడా వేస్తున్నారు. స్కూల్లో పాత్వేలు నిర్మిస్తున్నారు. నీటి సదుపాయం అందించనున్నారు. మరుగుదొడ్ల నిర్మాణం కొనసాగుతుంది. ఈ స్కూల్లో ప్రస్తుతం 18 గదులు ఉన్నాయి. అన్ని గదులకు కావాల్సిన ఫర్నీచర్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్కూల్లో 348 మంది విద్యార్థులు చదువుతున్నారు.
మెరుగైన ఫలితాలు సాధిస్తాం
మన ఊరు – మన బడిలో భాగంగా మా పాఠశాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది. పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా మా పాఠశాలలో మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేస్తాం.
విద్యార్థులకు వరం
ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుని అబిడ్స్లోని ఆలియా ఉన్నత పాఠశాల, మహబూబియా బాలికల ఉన్నత పాఠశాలల అభివృద్ధి చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు ఇదో వరంలా మారనుంది. అన్ని స్కూళ్లను ఇంగ్లీష్ మీడియంగా మార్చబోతున్నట్లు సీఎం కేసీఆర్, విద్యా మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ప్రైవేటు స్కూల్ విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు తీసుకునే అవకాశాలు మెరుగుపడుతాయి.