హైదరాబాద్ : శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా.. ఎయిర్ పోర్ట్ కాలనీ వద్దకు రాగానే ఒక్కసారిగా కారు ఇంజిన్లో నుంచి మంటలు చెలరేగాయి. కారులో ఉన్న డ్రైవర్కు మంటలు అంటుకొని.. అందులో చిక్కుకుపోయాడు. వెనుకాలే వస్తున్న లారీ, ఆటో డ్రైవర్ గమనించి వెంటనే అతన్ని కారు నుంచి బయటకు తీశారు. అనంతరం 108 వాహనంలో హాస్పిటల్కు తరలించారు. గాయపడ్డ వ్యక్తి రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండలం తిమ్మాపూర్కు చెందిన శ్రీకాంత్గా గుర్తించారు. శ్రీకాంత్ మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.