తనపై కొందరు కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. వారిపై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ టికెట్ మల్రెడ్డి బ్రదర్స్కు కష్టమని, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని అడిగితే కాంగ్రెస్ టికెట్ ఎవరికి వస్తుందనేది తెలుస్తుందన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఏం చేస్తారో చివరి వరకు ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి మాజీ ఎంపీ మధుయాష్కీ కూడా ప్రయత్నిస్తున్నారని తెలిపారు.