బెంగళూరు: వరుస విజయాలతో ఇప్పటికే నాకౌట్కు అర్హత సాధించిన జట్టుకు.. పరాజయాల బాట వీడేందుకు తీవ్రంగా శ్రమిస్తూ పాయింట్ల పట్టికలో అట్టడుగున స్థిరపడ్డ టీమ్కు మధ్య జరిగిన పోరులో టేబుల్ టాపర్నే విజయం వరించింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తెలుగు టైటాన్స్కు పదిహేనో పరాజయం తప్పలేదు. సోమవారం జరిగిన పోరులో టైటాన్స్ 30-38తో పట్నా పైరెట్స్ చేతిలో ఓటమి పాలైంది. లీగ్లో పట్నాకు ఇది విజయాల డబుల్ హ్యాట్రిక్ కాగా.. టైటాన్స్కు వరుసగా మూడో పరాజయం. మరో మ్యాచ్లో యూపీ యోధా 44-28తో దబంగ్ ఢిల్లీపై గెలిచింది.