న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీస్ లిమిటెడ్(ఫెడ్ఫినా) ఐపీవోకి రాబోతున్నది. ఫెడరల్ బ్యాంక్ అధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆర్థిక సేవల సంస్థ శనివారం స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది కూడా. ఈ పబ్లిక్ ఇష్యూద్వారా గరిష్ఠంగా రూ.900 కోట్ల వరకు నిధులను సమీకరించాలని సంస్థ యోచిస్తున్నది. సంస్థలో ప్రమోటర్లు, పెట్టుబడిదారులకు ఉన్న షేర్లలో 45,714,286 ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయించనున్నది. వాటా విక్రయ అనంతం ఫెడరల్ బ్యాంక్ 51 శాతం వాటాను కలిగివుండనున్నది.