కామారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెద్దకొడప్గల్ మండలంలోని కాటేపల్లి గ్రామానికి చెందిన రైతు గౌస్(45) విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాడు. గౌస్ తన పొలానికి నీరు పారించేందుకు వెళ్లగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించారు.