జగిత్యాల రూరల్, డిసెంబర్ 8:పొలంలో వరికొయ్యలను కాలు స్తూ ప్రమాదవశాత్తు నిప్పంటుకొని రైతు మరణించాడు. ఈ ఘ టన జగిత్యాల రూరల్ మండలంలోని వెల్దుర్తిలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన పోతుగంటి లక్ష్మణ్ (65) రెండెకరాల్లో వరి సాగు చేశాడు. ఇటీవలే పంట కోశాడు. బుధవారం ఉదయం 11 గంటలకు పొలంలో కొయ్యకాళ్లను కాలుస్తుండగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న గడ్డికుప్పలు అంటుకుంటాయనే ఆందోళనతో ఆర్పేందుకు యత్నించాడు. ఈక్రమం లో మంటల్లో చిక్కుకొని తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి భా ర్య భూమక్క, కొడుకు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.