సోషల్ మీడియా సెలబ్రిటీలకు పురస్కారాలను అందిస్తూ ‘ఇన్ఫ్లూయెన్సర్ అవార్డ్స్ 2022’ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. విప్రైడ్ సమర్పణలో సందీప్ గౌతమ్ సారథ్యంలోని శ్రీని ఇన్ఫ్రా, యు మీడియాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగింది. దీని వల్ల మారుమూల ప్రాంతాల యువతీయువకులకు కూడా గుర్తింపు లభిస్తున్నది. అలాంటి వారిని గుర్తించి పురస్కారాలు ఇవ్వడం వాళ్లను మరింత ప్రోత్సహించినట్లే. ఈ పురస్కారాలు ఇవ్వడం సంతోషంగా ఉంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, నాయికలు పూర్ణ, హెబ్బా పటేల్ తదితరులు పాల్గొన్నారు.