హైదరాబాద్, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా నియమితులైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మను, నూతన న్యాయమూర్తులు పీ శ్రీ సుధ, సీ సుమలత, జీ రాధారాణి, ఎం లక్ష్మణ్, నూన్సావత్ తుకారాంజీ, ఏ వెంకటేశ్వర్రెడ్డి, పీ మాధవీదేవిని హైకోర్టు బార్ అసోసియేషన్ సోమవారం ఘనం గా సతరించింది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నం అశోక్గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, బార్ అసోసియేషన్ కార్యదర్శి కళ్యాణ్రావు పాల్గొన్నారు.