న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఉక్రెయిన్పై దాడి నేపథ్యంలో రష్యాకు చేసే ఎగుమతులపై కవరేజీని ఉపసంహరించాలని ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (ఈసీజీసీ) నిర్ణయించింది. ఈ నెల 25 నుంచే ఇది అమల్లోకి రాగా, ఎగుమతిదారులకు ఈ నిర్ణయం ఎదురుదెబ్బగా పరిశ్రమ సంఘం ఎఫ్ఐఈవో అభిప్రాయపడింది. మరోవైపు ఈ యుద్ధంతో సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు ప్రభావితమవుతున్నాయని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో కొరత రాకుండా ఇతర దేశాల నుంచి వంటనూనెల దిగుమతికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది.