పీర్జాదిగూడ, జనవరి 8: అర్హులైన వారు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు.శనివారం 12వ డివిజన బుద్దానగర్ కాలనీలోని విజన్ జూనియర్ కళాశాలలో 15 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు కొవిడ్ టీకా వేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు 15 ఏండ్లు పై బడిన విద్యార్థులు టీకా వేయించుకోవాలని సూచించారు. మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. నగరపాలక సంస్థ పరిధి… 16వ డివిజన్లోని విజన్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కార్పొరేటర్ రమ్యసతీశ్ గౌడ్ పరిశీలించారు. కార్పొరేటర్ అమర్సింగ్, నాయకులు మోహన్రెడ్డి, మనోరంజన్రెడ్డి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
నాగారం మున్సిపాలిటీలో..
మేడ్చల్ కలెక్టరేట్ : ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని నాగారం మున్సిపల్ కమిషనర్ ఎ.వాణి రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు ప్రశాంత్ నగర్ కాలనీలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని శుక్రవారం కమిషనర్ పరిశీలించారు. కౌన్సిలర్లు మాదిరెడ్డి వెంకట్ రెడ్డి, బిజ్జ శ్రీనివాస్ గౌడ్, కాలనీ అధ్యక్షుడు ప్రేంచందర్ రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.