సికింద్రాబాద్, జనవరి 25: పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే సాయన్న అన్నారు. కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన 24 మందికి సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన సుమారు రూ.9.52లక్షల విలువైన చెక్కులను కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా లబ్ధి పొందాలని సూచించారు. చికిత్స చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ ఆసరాగా నిలుస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు నళినికిరణ్, పాండుయాదవ్, లోక్నాథ్, శ్యామ్కుమార్, ప్రభాకర్, నేతలు నివేదిత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, జీహెచ్ఎంసీ మాజీ కో ఆఫ్షన్ సభ్యులు నర్సింహముదిరాజ్, ముప్పిడి మధుకర్, నగేశ్, సరిత, తేజ్పాల్, భాస్కర్, సదానంద్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్వోసీ అందజేసిన డిప్యూటీ స్పీకర్
నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్మండికి చెందిన ఉమర్ ఫరూక్కు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.75వేల విలువైన ఎల్వోసీ పత్రాలను తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారునికి ఆయన అందజేశారు. కార్యక్రమంలో వెంకటేశ్తో పాటు నేతలు రామచందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.