IND vs ENG 3rd Test : రాజ్కోట్ టెస్టులో ఇంగ్లండ్(England)కు భారీ టార్గెట్ నిర్దేశించిన భారత్ వికెట్ల వేట మొదలెట్టింది. 557 పరుగుల కొండంత లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయింది. డేంజరస్ ఓపెనర్లు బెన్ డకెట్(4), జాక్ క్రాలే (11)లు స్వల్ప స్కోర్కే పెవిలియన్ కాసేపట్లో టీ అనగా క్రాలేను బుమ్రా ఎల్బీగా వెనక్కి పంపాడు. దాంతో, ఇంగ్లండ్ 18/2 తో టీకి వెళ్లింది. ఓలీ పోప్ రెండు పరుగులతో క్రీజులో ఉన్నాడు.
ఈ మ్యాచ్లో గెలవాలంటే ఇంగ్లీష్ జట్టుకు 539 పరుగులు కావాలి. సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లేందుకు భారత్కు ఎనిమిది వికెట్లు అవసరం. నాలుగో రోజు ఇంకా 32.4 ఓవర్లు బాకీ ఉన్నాయి. దాంతో, మరో మూడు, నాలుగు వికెట్లు తీసి బెన్ స్టోక్స్ సేనను ఒత్తిడిలోకి నెట్టాలని రోహిత్ బృందం భావిస్తోంది.
Two early wickets for #TeamIndia as we head to Tea on Day 4 in Rajkot!
England 18/2 in the chase.
Scorecard ▶️ https://t.co/FM0hVG5X8M#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/QafmXdVjh6
— BCCI (@BCCI) February 18, 2024
వైజాగ్ టెస్టులో డబుల్ సెంచరీతో చెలరేగిన భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(213 నాటౌట్ : 235 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్సర్లు) రెండో డబుల్ సెంచరీ కొట్టాడు. అరంగేట్రం బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్(68నాటౌట్ : 72 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో, భారత జట్టు 430 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
The moment Yashasvi Jaiswal hit his second Test double hundred 🫡
(via @BCCI) | #INDvENG pic.twitter.com/JLALwICRpv
— ESPNcricinfo (@ESPNcricinfo) February 18, 2024