ఎడ్జ్బాస్టన్: ఇంగ్లండ్తో జరగనున్న అయిదో టెస్టులో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. ఇవాళ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. చేజింగ్ తమ ఆట తీరు బాగున్నట్లు కెప్టెన్ స్టోక్స్ తెలిపాడు.ఇంగ్లండ్ జట్టులోకి అండర్సన్, బిల్లింగ్స్ వచ్చారు. రోహిత్ లేని కారణంగా.. ఓపెనర్గా పూజారా ఆడనున్నాడు. ఈ మ్యాచ్కు ఇండియా జట్టులోకి నాలుగు పేస్ బౌలర్లను తీసుకున్నారు. బుమ్రా, షమీ, సిరాజ్, శార్దూల్ స్పీడ్ బౌలింగ్ చేయనున్నారు.
భారత జట్టు: గిల్, పూజారా, విహారి, కోహ్లీ, అయ్యర్, పంత్, జడేజా, శార్దూల్, షమీ, సిరాజ్, బుమ్రా
ఇంగ్లండ్ జట్టు: అలెక్స్ లీస్, జాక్ క్రాలీ, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్, శామ్ బిల్లింగ్స్, మాథ్యూ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్