తిరువనంతపురం : చెత్త నుంచి సంపద సృష్టిని కేవలం నినాదానికే పరిమితం చేయకుండా వినూత్న ఆవిష్కరణతో తిరువనంతపురానికి చెందిన ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ బార్టన్ హిల్ విద్యార్ధులు సత్తా చాటారు. ఆక్సియా టెక్నాలజీస్ మార్గదర్శకత్వంలో వీరు రీసైకిల్డ్ వేస్ట్ నుంచి ఎలక్ట్రిక్ కారును డిజైన్ చేశారు.
ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎఫీషియన్సీ కాంపిటీషన్, షెల్ ఎకో మారధాన్ (ఎస్ఈఎం) 2022 ప్రాజెక్టు కోసం ఈ కారుకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఇండోనేషియాలో అక్టోబర్ 11 నుంచి 16 వరకూ జరిగే ఈవెంట్లో కాలేజ్ మెకానికల్ స్ట్రీమ్కు చెందిన 19 మంది విద్యార్ధుల బృందం ప్రవేగ వాండీ అనే ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించనుంది.
ఈ ఈవెంట్లో కాలేజ్కు చెందిన ఐదు బృందాలు ఎంపికయ్యాయి. ప్రకృతి నుంచి విసర్జించిన వ్యర్ధాలు, రీసైకిల్డ్ వేస్ట్ నుంచి కారును తయారుచేశామని ప్రవేగ టీం లీడర్ కళ్యాణి ఎస్ కుమార్ చెప్పారు. తక్కువ కార్బన్ ఫుట్ప్రింట్, తేలికగా ఉండే, ఏరోడైనమిక్స్తో కూడిన డిజైన్తో వాండీని సృష్టించామని చెప్పారు. ఈ మొబిలిటీ స్పేస్లో టెక్నాలజీ లీడర్గా ఉన్న ఆక్సియా టెక్నాలజీ ఈ ప్రాజెక్టుకు మెంటార్గా వ్యవహరించింది.