హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలలకు సంబంధించి మొదటి విడుత సీట్లు కేటాయించినట్లు సాంకేతిక కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 60,941 ఇంజినీరింగ్ సీట్లు (82.24 శాతం) కేటాయించారు. అయితే కన్వీనర్ కోటాలో 13,130 ఇంజినీరింగ్ సీట్లు మిగిలాయి.
ఈడబ్ల్యూఎస్ కోటాలో 5,108 సీట్లను కేటాయించారు. 31 ఇంజినీరింగ్ కళాశాలల్లో తొలి విడుతలోనే సీట్లన్నీ భర్తీ అయ్యాయి. 4,199 బీ ఫార్మసీ, ఫార్మ్ డీ సీట్లలో కేవలం 228 మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ నెల 23లోపు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని విద్యార్థులకు సూచించారు. అయితే ఫార్మా కోర్సుల్లో ఎంపీసీ అభ్యర్థుల కోటాకు స్పందన కరువైంది.