రేవల్లి, నవంబర్ 30 : ప్రత్యేక రాష్ట్రంలో పుష్కలంగా సాగునీరు ఉండడంతో పల్లెల్లోనే ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. మండలంలోని తల్పునూర్ గ్రామంలో మంగళవారం రాత్రి పల్లెనిద్ర అనంతరం బుధవారం ఉదయం పర్యటించారు. అదే గ్రామానికి చెందిన రుక్మాకర్రెడ్డి 35 ఏండ్ల పాటు అమెరికాలో ఉండి స్వగ్రామానికి తిరిగివచ్చి రూ.20లక్షల వ్యయంతో ఎకరాలో స్టాండ్ఫీడింగ్ విధానంలో మేకల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మంత్రి నిరంజన్రెడ్డి ఫాంను పరిశీలించి అభినందించారు. విదేశాలకు వెళ్లిన వారు కూడా స్వగ్రామాలకు వస్తున్నారనడానికి రుక్మాకర్ నిదర్శనమన్నారు.
యువత భిన్నమైన వృత్తులను ఎంచుకోవాలన్నారు. పొలాల్లో ఉన్న బాటల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నేతాజీ యువజన సంఘం భవన నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తానన్నారు. అనంతరం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. రూ.1.50 కోట్ల వ్యయంతో నూతన పాఠశాల భవనం మంజూరైందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సేనాపతి, జెడ్పీటీసీ భీమయ్య, సింగిల్విండో చైర్మన్ రఘు, వైస్ ఎంపీపీ మధుసూదన్రెడ్డి, తాసిల్దా ర్ శ్రీరాములు, మండల విద్యుత్ అధికారి నర్సింహ, మిషన్ భగీర థ ఏఈ మొగులయ్య, సర్పంచులు నరేందర్రెడ్డి, లక్ష్మి, జ్యోతి, ఇం దిర, నారాయణరెడ్డి, రమేశ్, సునీల్కుమార్, జగదీశ్వర్, ఎంపీటీసీ లు కుర్మతిరెడ్డి, శ్రీశైలంయాదవ్, నాయకులు ప్రమీలమ్మ, అనురాధ, నాగరాజు, రఘురామారావు, శ్రీనివాస్రెడ్డి, రాములు, రవి, సురేందర్రెడ్డి, శశిధర్రెడ్డి, అల్తాఫ్, శంకర్రెడ్డి, సురేశ్ పాల్గొన్నారు.