Emiliano Martinez : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అర్జెంటీనా విజయం తర్వాత ఆ జట్టు గోల్ కీపర్ ఎమిలియనో మార్టినేజ్ వివాదంలో నిలిచిన విషయం తెలిసిందే. గోల్డెన్ గ్లోవ్ అందుకున్న తర్వాత అతను ఆ గ్లోవ్ను అసభ్యకరంగా పట్టుకుని ఫొటోలకు పోజులిచ్చాడు. తాజాగా మార్టినేజ్వరల్డ్ కప్ వివాదంపై స్పందించాడు. గోల్డెన్ గ్లోవ్తో అలా మళ్లీ చేయొద్దని కెప్టెన్ లియోనల్ మెస్సీ నన్ను వారించాడని అతను తెలిపాడు. ‘గోల్డెన్ గ్లోవ్తో అసభ్యకరంగా పోజులివ్వడం అనేది నా జట్టు సభ్యులతో నేను చేసిన జోక్.
అచ్చం ఇలానే నేను కోపా అమెరికా కప్లో చేశాను. అప్పుడు అందరూ అలా చేయొద్దు అని మందలించారు. ఆరోజు అలా సెలబ్రేట్ చేసుకోవడం పట్ల బాధపడుతున్నానా? అంటే అదేం లేదు. కొన్ని పనులను నేను మళ్లీ ఒకే విధంగా చేయను. అయితే.. ఎవరినీ బాధ పెట్టాలని నేను అలా చేయలేదు’ అని మార్జినేజ్ తెలిపాడు.
అంతేకాదు ఫ్రాన్స్ ఆటగాడు ఎంబాపేతో స్టయిల్ను అనుకరించడం, అతడితో అమర్యదగా ప్రవర్తించడంపై కూడా అర్జెంటీనా గోల్ కీపర్ మాట్లాడాడు.. ‘నా కెరీర్లో ఫ్రాన్స్ దేశస్థులతో ఆడాడు. వాళ్లతో నాకు ఏ సమస్యా ఎదురవ్వలేదు. నేను ఎలాంటి వ్యక్తిని అనేది ఫ్రాన్స్ ప్లేయర్ ఒలివర్ జొనాథన్ గిరౌడ్ని అడగండి. నాకు ఫ్రాన్స్ సంస్కృతి, అక్కడి ప్రజల ఆలోచనా విధానం అంటే చాలా ఇష్టం’ అని మార్టినేజ్ అన్నాడు. ఉత్కంఠగా జరిగిన ఫైనల్లో అర్జెంటీనా 4-2తో ఫ్రాన్స్ను ఓడించింది. షూటౌట్లో మార్టినేజ్ గోల్స్ అడ్డుకుని అర్జెంటీనా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎంబాపే హ్యాట్రిక్ గోల్స్ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు.
మ్యాచ్ అనంతరం గోల్డెన్ గ్లోవ్తో మార్జినేజ్ తప్పుడు ప్రవర్తనను ఫిఫా సీరియస్గా తీసుకుంది. అతని తీరుపై, అర్జెంటీనీ సెలబ్రేట్ చేసుకున్న విధానంపై దర్యాప్తు చేపట్టింది. అంతేకాదు గోల్ కీపర్లు ఆటగాళ్ల దృష్టి మరల్చే చర్యలకు పాల్పడకుండా చేసేందుకు కొత్త నిబంధనలను తీసుకు రావాలని ఫిఫా నిర్ణయించుకుంది.