ముంబై,జూన్ 24: కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన సబ్సిడీ సవరణలతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.ఫేమ్ -2 (ఫాస్ట్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (హైబ్రిడ్) ఎలక్ట్రిక్) ఈవీ పాలసీలో కింద మార్పులు చేసింది. అంతేకాదు ఫేమ్-2 స్కీమ్ను 2025 వరకు పొడిగించింది కూడా. ఫలితంగా దేశంలోని ఈవీ తయారీ సంస్థలు తమ దీర్ఘకాలిక ప్రణాళికలను మరింతగా బలోపేతం చేసుకోవడానికి వీలుకలుగుతుంది. ఇప్పటికే పలు ఈవీ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు తమ వాహనాలపై పెద్దమొత్తంలో తగ్గింపు అందిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో దేశంలోకరోనా మహమ్మారి ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ టూ-వీలర్ల అమ్మకాలు మాత్రం బాగానే ఉన్నాయి.