అమరావతి : ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఆరోపణలపై మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు, టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్పై కేసు నమోదైంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా ధర్మవరంలోని ఓ మసీదులో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ప్రచారం చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో శ్రీరామ్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారని ఎన్నికల పరిశీలకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదైంది.