చర్లపల్లి, జనవరి 19 : నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో సుమారు రూ.56 లక్షలతో చేపట్టిన పనులను ఎమ్మెల్యే, కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషా సోమశేఖర్రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామన్నారు. పాఠశాలలో సీసీ రోడ్డు పనులు, గార్డెన్ పనులు చేపడుతున్నామన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులకు బోధన జరిగేలా అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈసీఐఎల్ పరిశ్రమ యజమాన్యం సీఎస్ఆర్ నిధులతో స్కూల్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఈసీఐఎల్ పరిశ్రమ యూనియన్ అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్రెడ్డి, ఉపాధ్యాయ సంఘం నాయకులు రమేశ్రెడ్డి, నాయకులు సోమశేఖర్రెడ్డి, గరిక సుధాకర్, గడ్డం రవికుమార్, కాటేపల్లి రవీందర్రెడ్డి, కిరణ్, ఎస్కే.కరీం, సత్యనారాయణ, సీసీఎస్ ప్రతినిధి ఎంపెల్లి పద్మారెడ్డి, గంప కృష్ణ, వినోద్, ఉపేందర్, వెంకటేశ్, చంద్రమౌళి, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.