ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులలో 45,256 మంది ఓటర్లు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు లెక్క తేల్చారు. అందుకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ఈఎంసీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి ఆయా విభాగాల అధికారులతో కలిసి విడుదల చేశారు. మొత్తం 45 వేల మంది ఓటర్లలో.. 21,742 మంది పురుష ఓటర్లు, 23,511 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మరో ముగ్గురు ఇతర ఓటర్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.
అత్యధికంగా మొదటి వార్డులో 1,710 మంది ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా 20వ వార్డులో ఒక వెయ్యి 262 మంది ఓటర్లు ఉన్నారు. వార్డుల వారిగా పరిశీలిస్తే.. రెండో వార్డులో 1,445 మంది, మూడవ వార్డులో 1,658 మంది, నాలుగో వార్డులో 1,469 మంది, ఐదవ వార్డులో 1,691 మంది, ఆరవ వార్డులో 1,697 మంది, ఏడవ వార్డులో 1,338 మంది, 8 వ వార్డులో 1,338 మంది, 9 వ వార్డులో 1,330 మంది, పదవ వార్డులో 1,410 మంది, 11 వ వార్డులో 1,440 మంది, 12 వ వార్డులో 1,263 మంది, 13 వ వార్డులో 1,323 మంది ఓటర్లు ఉన్నారు.
ఇక 14వ వార్డులో 1,357 మంది, 15వ వార్డులో 1,444 మంది, 16వ వార్డులో 1,280 మంది, 17వ వార్డులో 1,365 మంది, 18వ వార్డులో 1,337 మంది, 19వ వార్డులో 1,320 మంది, 20వ వార్డులో 1,262 మంది, 21వ వార్డులో 1,323 మంది, 22వ వార్డులో 1,534 మంది, 23వ వార్డులో 1,694 మంది, 24వ వార్డులో 1,437 మంది, 25వ వార్డులో 1,384మంది, 26వ వార్డుల 1,301 మంది, 27వ వార్డులో 1,264 మంది, 28వ వార్డులో 1,381 మంది, 29వ వార్డులో 1,694 మంది, 30వ వార్డులో 1,293 మంది, 31వ వార్డులో 1,414 మంది, 32వ వార్డులో 1,271 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అయితే ఈ ఓటర్ల జాబితాలో అభ్యంతరాలకు అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అందులో బాగంగానే ఈనెల 5న ఆ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి 10న ఫైనల్ ఓటర్ లిస్టును విడుదల చేసేందుకు అధికారులు పనులు ప్రారంభించారు.