ఇవ్వాళ… తెలంగాణలో అన్ని లోగిళ్ళలో అందరి కండ్లు టీవీల్లో చూపిస్తున్న యాదాద్రి వైభవం చుట్టూనే అల్లుకు పోయి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు యాదగిరి గుట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం స్థాయిలో పునర్నిర్మించడానికి ఏ ముహూర్తంలో నిర్ణయించారో కానీ, అది ఈనాటికి నిజమైంది.
గతంలో యాదాద్రి గుడినీ, ఆ పరిసరాలను చూసి న వారు ఇప్పుడు కనిపిస్తున్న బ్రహ్మాండమైన కట్టడాల ను, శిల్పాలను చూస్తే ఆశ్చర్యచకితులు కాక మానరు. వందలాదిమంది శిల్పులు, అహరహం శ్రమించిన అధికారులు, సిబ్బంది శ్రమ ఫలితాన్ని మనం అక్కడ సుందర అద్భుత నిర్మాణాల రూపంలో చూస్తున్నాం. ఇదంతా కేవలం ఆరేండ్ల కాలంలో జరిగింది అంటే నమ్మశక్యం కాదు.
ఇందుకు కర్త, కర్మ, క్రియ యావత్తు సీఎం కేసీఆర్ గారే. ఆయన సంకల్ప బలం ఫలితమే ఈనాటి మహాకుంభ సంప్రోక్షణ క్రతువు. ఆలయ పునర్నిర్మాణంలో కృషి చేసిన స్థపతులను, ఇతరులను సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు సముచిత రీతిన సత్కరించటం ముదావహం. ఈ కార్యక్రమాన్ని టీవీలో ‘లోనారసి’గా వీక్షిస్తే (‘లోనారసి’ అనే పదాన్ని లోతుగా (లోతులకు వెళ్లి పరీక్షగా చూడటం) అనే అర్థంలో వాడతారు) అప్పుడు కనపడ్డారు, ఓ పక్కగా అంతవరకూ కనపడని జి.కిషన్ రావు. ముఖ్యమంత్రి చైర్మన్గా ఉన్న యాదాద్రి టెంపు ల్ డెవలప్ మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ ఆయన. ఈ బృహత్ కార్యానికి ముఖ్యమంత్రి సర్వస్వం అయితే, కిషన్రావు ముఖ్యమంత్రి మనసులో ఏమని అనుకుంటున్నారో అచ్చం ఆవిధంగానే ఆచరణలో చేసి చూపించారు. దండలో దారంలాగా ఈ పునర్నిర్మాణ క్రతువు లో ఆయన నిర్వహించిన పాత్ర ఎనలేనిది.
సీనియర్ ఐఏఎస్ అధికారి కిషన్రావు వయసు 80 ఏండ్లు దాటినా ఆయనలో అలసట లేదు. తన పెన్షన్ డబ్బులు తప్ప, రిటైర్ అయిన తర్వాత చేస్తున్న ఏ ఉద్యోగానికీ జీతం తీసుకోరు. ఒకప్పుడు శిల్పారామం అంటే గుర్తుకు వచ్చే కిషన్రావు పేరు, యాదాద్రి వెళ్ళినప్పుడల్లా స్పురణకు రావడం ఖాయం.
బండారు శ్రీనివాసరావు