చెట్టెక్కడానికి ప్రయత్నించేవాడు ఒకడుంటే వాడిని కాలుపట్టి కిందకు లాగేవాడు ఒకడుంటాడని పెద్దలు చెప్తుంటారు. అయితే చెట్టెక్కించాల్సినవాడే కాలుపట్టి లాగితే ఎంత దారుణం! ఇప్పుడు దేశంలో అదే జరుగుతున్నది. దేశాన్ని అభివృద్ధిలో అగ్రస్థానానికి తీసుకెళ్లేందుకు మన రాష్ట్రం పరుగులు పెడుతుంటే, కాలుపట్టి మరీ కిందకు లాగుతోంది మోదీ సర్కారు. రాష్ర్టాలకు బాసటగా నిలిచి ప్రగతిపథంలో నడిపించాల్సినవాళ్లే అభివృద్ధికి అడ్డుగోడలుగా మారారు!
తక్కువ ఖర్చుతో ఆహారం కొనుగోలు అనే అంశంలో భారత్కు 50.2 పాయింట్లు, పాక్కు 52.6 పాయింట్లు, శ్రీలంకకు 62.9 పాయింట్లు దక్కాయి. ఆహారభద్రత విషయంలో మన దేశం నేలచూపులు చూస్తున్నది. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్లో 4.48 శాతానికి పెరిగింది. సెప్టెంబర్లో ఇది 4.35 శాతంగా ఉన్నది. ఆహారపదార్థాల ధరలు పెరగడం వల్లే ద్రవ్యోల్బణం పెరిగిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
‘గ్లోబల్ హంగర్ రిపోర్ట్’ ప్రకారం.. గతంతో పోలిస్తే భారత్ పరిస్థితి మరీ దిగజారిపోయింది. 2014లో ప్రధాని మోదీ బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రపంచ ఆరోగ్య సూచీ ప్రకారం భారత్ 55 స్థానంలో ఉండేది. కానీ ఇప్పు డు అంటే ఈ ఏడేండ్ల మోదీ పాలనలో అది రెట్టింపయ్యింది. 2015లో 80వ స్థానానికి చేరగా, 2016లో 97కు పెరిగింది. 2017లో 100వ స్థానం, 2018లో 103వ స్థానం, 2019లో 102వ స్థానం, 2020లో 94వ స్థానం, 2021లో 101వ స్థానానికి చేరింది. పొరుగునే ఉన్న చిన్నదేశాలు మనకంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి. మయన్మార్ 71వ స్థానంలో ఉండగా, నేపాల్, బంగ్లాదేశ్ 76వ స్థానంలో, పాకిస్థాన్ 92వ స్థానంలో ఉండ టం గమనార్హం. వీటికంటే భారత్ 30 స్థానాలు దిగజారిపోవడం పాలనా వైఫల్య మే.‘గ్లోబల్ హంగర్’ ఇండెక్స్ ప్రకారం భారత్ స్కోర్ 2000 సంవత్సరంలో 38.8గా ఉన్నది. 2012-21 మధ్యలో అది 28.8నుంచి 27.5కి పడిపోయింది. కరోనా కారణంగా పరిస్థితులు మరింత దిగజారాయనుకున్నా, 2014 నుంచే దేశంలో ఆకలి కేకలు పెరిగిపోవడం కేంద్రప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.
దేశంలో ప్రకృతి వనరులు, నీటి వసతులుపుష్కలంగా ఉన్నాయి. ప్రజల కడుపు నింపి, ప్రపంచ దేశాల ఆకలి తీర్చే పరిస్థితులున్నాయి. దేశంలో 40 కోట్ల ఎకరాల సారవంతమైన సాగుభూమి ఉంది. సమశీతోష్ణ వాతావరణ పరిస్థితులున్నాయి. అంటే ఏ పంటలైనా పండించే అవకాశం ఉన్నది.గంగా, యమునా, గోదావరి, బ్రహ్మ పుత్ర జీవ నదులున్నాయి. ఈ నదుల్లో 65 వేల టీఎంసీల నీరున్నది. ఈ నీటిలో సగం వాడుకున్నా దేశం సస్యశ్యామలం అవుతుంది. పాలకులు కాస్త బాసటగా ఉంటే రైతులు అద్భుతాలు సాధిస్తారు. దీనికి నిదర్శనమే మన తెలంగాణ రాష్ట్రం. అతి తక్కువ కాలంలో నీటి వసతి మెరుగుపరుచుకొని, విద్యుత్ సౌకర్యం కల్పించుకొని, ఇప్పుడు కోటికి పైగా ఎకరాల్లో సాగయ్యే స్థాయికి ఎదిగింది. వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ రాష్ర్టాన్ని వెనక్కినెట్టి ముందుకు దూసుకెళ్తున్నది. దేశానికే అన్నం పెట్టేస్థాయికి ఎదిగింది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనంత రికార్డుస్థాయిలో ధాన్యం పండిస్తున్నది. 2019-20లో రెండు సీజన్లు కలిసి కోటి 30 లక్షల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి జరిగింది. ఇప్పుడది మరింత పెరిగింది. 2014-2015లో 34.96 లక్షల ఎకరాల్లో వరి సాగయితే ఇప్పుడది 62 లక్షల ఎకరాలకు పెరిగింది.
దేశంలో అన్నిరకాల వనరులు, అనుకూల పరిస్థితులున్నా, గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారత్ నానాటికి ఎందుకు దిగజారుతున్నదీ? వ్యవసా యం ఉమ్మడి జాబితాలోని అంశం. ఆహారధాన్యాలు సేకరించి, నిల్వచేసి, అవసరమైనప్పుడు ప్రజలకు పంపిణీ చేయడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర కీలకమైనది. దేశంలో ఏయే ఆహారధాన్యాల కొరత, ఏ ధాన్యాలు నిల్వలు తక్కువున్నాయి, ఏవి పండిస్తే దేశానికి ఉపయోగపడతాయి, రైతులకు లాభసాటిగా ఉంటుందనే విషయాలపై కేంద్రం అధ్యయనం చేయాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేయాలి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వమే ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తుంటే బీజేపీ నాయకులు నానా యాగీ చేయ డం ఆశ్చర్యకరం.
2021కిగాను 113 దేశాల్లో పరిస్థితి పరిశీలించి ఆహారలభ్యత విషయంలో ర్యాంకులు విడుదల చేశారు. ఇందులో భారత్కు 71వ స్థానం దక్కింది. జనాభా విస్ఫోటంతో అల్లాడుతున్న చైనా 34వ స్థానంతో భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉన్నది. భారత్తో పోలిస్తే శ్రీలంక, పాకిస్థాన్లో ఆహారం తక్కువ ధరకే అందుబాటులో ఉంది. గత పదేండ్లలో ఆహారభద్రత విషయంలో భారత్ పనితీరును ఆ నివేదికలో ప్రస్తావించారు.
నానాటికి ప్రజల కొనుగోలు శక్తి దిగజారుతుంటే ఆహారపదార్థాల ధరలు మాత్రం పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఏ ప్రణాళిక లేకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే. ఏటా ఏ సమయంలో ఏ ఆహారధాన్యాల కొరత ఏర్పడుతోంది. ఏ సమయానికి వేటిని అందుబాటులో ఉంచాలి? బ్లాక్ మార్కెట్కు తరలించకుండా ఎలా జాగ్రత్తపడాలి.? ప్రజల అవసరాలు తీర్చడానికి ఎగుమతులు ఆపేయాలా?అనే ఆలోచనలు కేంద్ర సర్కారుకు లేనే లేవు. అందువల్ల ఏటా కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకుల ధరలు ఒకేసారి ఆకాశన్నంటడం, ఆ తర్వాత కుప్పకూలిపోవటం జరుగుతున్నది. దీంతో వినియోగదారులు , రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పేదలు అనేక ఇబ్బందులు పడుతుంటే, కేంద్ర పాలకులు మాత్రం ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మ నిర్భర్ భారత్’ అంటూ గప్పాలు కొడుతున్నారు.
ఎవరైనా గట్టిగా మాట్లాడితే దేశ ద్రోహులనే ముద్ర వేస్తున్నారు. ఈడీని, ఐటీని ఉసిగొల్పుతున్నా రు. కానీ రాష్ర్టాల దగ్గరున్న ఆహార ధాన్యాలను కొనుగోలు చేసి, భద్రపరిచి ప్రజల ఆకలితీర్చే బాధ్యతను మాత్రం విస్మరిస్తున్నారు.
వై.సతీష్ రెడ్డి
96414 66666