న్యూఢిల్లీ: తాము తీసుకున్న పలు చర్యల వల్ల వంటనూనె ధరలు తగ్గుతున్నాయని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రధాన మార్కెట్లలో కిలో నూనెకు రూ.5 నుంచి రూ.20 వరకు ధర తగ్గినట్టు వెల్లడించింది. తగ్గింపు ధరలు పాత స్టాక్కు కూడా వర్తించేలా చూడాలని వాణిజ్య సంఘం ఎస్ఈఏ డిస్ట్రిబ్యూటర్లకు సూచించిందని పేర్కొంది. అంతేగాక తగ్గింపు ధరలతోనే కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తామని వర్తకులు హామీ ఇచ్చారని కేంద్రం వివరించింది.