న్యూఢిల్లీ, జనవరి 31: రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ)పై తక్కువ ఖర్చు చేయడం కూడా పేటెంట్ల విషయంలో చైనా, అమెరికా వంటి దేశాల కంటే భారత్ వెనుకబడేందుకు ఒక కారణమని ఆర్థిక సర్వే వెల్లడించింది. భారత్లో మంజూరైన పేటెంట్ల సంఖ్య చైనా, అమెరికా, జపాన్లో మంజూరైన వాటిలో ఒక భాగమేనని పేర్కొన్నది. విధానపరమైన ఆలస్యం, ప్రక్రియలో నెలకొన్న సంక్లిష్టత కూడా తక్కువ పేటెంట్లకు ఇతర కారణాలని తెలిపింది. భారత్లో పేటెంట్లు పొందేందుకు తుది నిర్ణయం కోసం పట్టే సగటు కాలవ్యవధి 2020 నాటికి 42 నెలలు ఉండగా, ఇది అమెరికా, చైనా, కొరియా, జపాన్లలో వరుసగా 20.8, 20, 15.8, 15 నెలలు ఉన్నది.