స్టేషన్ ఘన్పూర్/జడ్చర్ల/భూత్పూర్, మే 12: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తు న్న దళితబంధుతో వారి జీవితాల్లో వెలుగులు నిం డుతున్నాయి. సర్కారు ఆర్థిక సాయంతో దళిత వర్గాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. గురువారం జనగామ, పాలమూరు జిల్లాల్లో లబ్ధిదా రులకు ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి యూనిట్లను పంపిణీ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో రూ.2.80 కోట్లతో 28 మందికి ఎమ్మెల్యే రాజయ్య, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి వాహనా లు అందజేశారు.
స్టేషన్ ఘన్పూర్ మండలంలోని 8 మందికి, చిల్పూర్లో 5, రఘునాథపల్లిలో 8, లింగాలఘనపూర్లో ఏడుగురికి యూనిట్లను పం పిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడు తూ పది లక్షల ఆస్తికి ఓనర్లు గా మారుతామని కళలో కూడా అనుకోలేదని అన్నారు. ఇదంతా కేసీఆర్ దయ వల్లే జరిగిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల క్యాంప్ కార్యాలయంలో దళితబంధు యూనిట్ల కింద లబ్ధిపొందిన ఉదండాపూర్కు చెందిన ముగ్గురికి కార్లు, వల్లూరుకు చెందిన ముగ్గురికి జేసీబీలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూరులో తాటిపర్తికి చెందిన కాశిపాండేకు దళితబంధు పథకంలో భాగంగా రూ.12 లక్షల డిజిటల్ సర్వే యంత్రాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అందజేశారు.