పోర్ట్బ్లేయిర్ : అడమాన్ దీవుల్లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 3.8 తీవ్రతతో రాత్రి 1.37 గంటల సమయంలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. నికోబార్ దీవిలోని క్యాంప్బెలే బే నుంచి 640 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు ఎస్సీఎస్ పేర్కొంది. గురువారం ఉదయం నాలుగు రాష్ట్రాల్లో భూమి కంపించింది. జమ్మూకాశ్మీర్లోని కత్రా, ఉత్తరప్రదేశ్లోని మీరట్, ఉత్తరాఖండ్లోని గర్హ్వాల్, గుజరాత్లోని జామ్నగర్లో ప్రకంపనలు వచ్చాయి. ప్రకంపనలు స్వల్పంగా రావడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.